సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

మరో ఘటనలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదారు సీఐ(Telangana Police). నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వెళ్ళింది( CI assaults woman).

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ.. వాతలు వచ్చేలా కొట్టిన వైనం, సీఐ తీరుపై తీవ్ర విమర్శలు

ఉత్సవాల్లో తన పర్సు పోయిందని అక్కడే ఉన్న పోలీసు ఔట్ పోస్టులో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మహిళను దూషిస్తూ, అనవసరంగా రాద్ధాంతం చేస్తావా అంటూ లాఠీతో మహిళను విచక్షణా రహితంగా చితకబాదారు సీఐ.

woman left newborn baby on the side of the road

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)