దేశంలో 5జీ విప్లవం రాబోతోంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్‌ కాల్‌ చేశారు. నెట్‌వర్క్‌ భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ విజయవంతంగా పరీక్షించామని, ఎండ్‌ టూ ఎండ్‌ నెట్‌వర్క్‌ను భారత్‌లో రూపొందించడంతో పాటు అభివృద్ధి చేశాం’ అంటూ కేంద్రమంత్రి కూ యాప్‌లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రతిపాదనను వచ్చే వారం తుది ఆమోదం కోసం కేంద్ర కేంద్ర కేబినెట్‌ ముందుంచే అవకాశం ఉన్నది. 5జీ సేవలు సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)