AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,841 కోవిడ్ కేసులు మరియు 38 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 3,963 మంది కరోనా నుంచి రికవరీ
COVID-19 | (Photo Credits: IANS)

Amaravathi, July 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాప్తి భారీగా తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపిలో వందల్లో నమోదయిన కోవిడ్ కేసులు మే నెల వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయాయు. మే 24న ఏపిలో రోజూవారీ కోవిడ్ కేసులు 24 వేల మార్కును దాటాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన కర్ఫ్యూతో వారాల వ్యవధిలోనే కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. ప్రస్తుతం రోజూవారీ కోవిడ్ కేసులు 4 వేలకు దిగువలోనే నమోదవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నా, తూర్పు గోదావరి మరియు చిత్తూరు జిల్లాల్లో కేసులు ఇంకా తగ్గాల్సి ఉంది.

ఇక, ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,574 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 3,841 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 18,93,954కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 18,90,459గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 760 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 616 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 38 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 12,744కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,963 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,42,432 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 38,178 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.