
Amaravathi, June 24: ఆంధ్రప్రదేశ్ సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వస్తుంది. గడిచిన మే నెలలో రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్ కేసులు 21 వేల మార్కును దాటగా, ఇది జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. వారం రోజుల నుంచి రోజూవారీ కోవిడ్ కేసులు 5 వేలకు దిగువలోనే నమోదవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నా, తూర్పు గోదావరి మరియు చిత్తూరు జిల్లాల్లో కేసులు ఇంకా తగ్గాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో జూన్ చివరి నాటికి కేసులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక, ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,622 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 4,981 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 18,67,017కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 18,64,122గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 943 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 854 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 38 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 12,490కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 6,464 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,04,844 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 49,683 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.