COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, February 25: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నామమాత్రంగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,443  మంది శాంపుల్స్ ను పరీక్షించగా 82 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,89,585 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,86,690గా ఉంది.

ఒక్క చిత్తూరు జిల్లాలోనే గడిచిన ఒక్కరోజులో కొత్తగా 21 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి, ఇక మిగతా అన్ని జిల్లాల్లో పది లోపే కేసులు వచ్చాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

గడిచిన ఒక్కరోజులో  కోవిడ్ మరణాలేమి నమోదు కాలేదు, ప్రస్తుతం ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7168గా ఉంది.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

 

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 74 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,81,806 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 611 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 61 శాతం పైగా హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు వ్యాక్సిన్ డోస్ పంపిణీ పూర్తయినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం నాటికి  1,20,443 మంది హెల్త్ కేర్ సిబ్బంది రెండో డోస్ వ్యాక్సిన్ అందుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.