Kadapa, August 25: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ప్రియుడు ఆమెను హత్య (Kadapa man killed woman) చేసిన ఘటన కడపలో చోటు చేసుకుంది. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడపలో (Kadapa) ఈ దారుణం చోటు చేసుకుంది.ఈ సంఘటనపై చిన్నచౌక్ పోలీసులు, మృతురాలి సోదరి గోవిందమ్మ కథనం మేరకు వివరాలిల ప్రకారం... దేవుని కడపకు చెందిన యశోద గత నాలుగేళ్లుగా మాసాపేటకు చెందిన నిత్యపూజయ్య అలియాస్ సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
కాగా, మృతురాలికి పదేళ్ల క్రితం జయశంకర్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగి విడిపోయారు. పిల్లలు భర్త జయశంకర్ వద్దే ఉన్నారు. ఈ క్రమంలోనే నిత్యపూజయ్య అలియాస్ సురేష్, యశోదలు గత నాలుగేళ్లుగా దేవునికడపలోని ఓ ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె తనను వివాహం (she asked marriage proposal ) చేసుకోవాలని నిత్యపూజయ్యను అడుగుతోంది. ఈ విషయమై పరస్పరం గొడవపడ్డారు.
ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి యశోద మంచంపై పడుకుని ఉన్న సమయంలో నిత్యపూజయ్య దిండును ఆమె తలపై పెట్టి ఊపిరాడకుండా చేసి, హత్య చేశాడు. తరువాత ఇంటికి తాళం వేసి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం వరకు తనకు ఫోన్ చేయకపోవడం, ఎలాంటి సమాచారం లేకుండా పోయేసరికి, మృతురాలి చెల్లెలు గోవిందమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లింది. అనుమానం వచ్చి స్థానికుల సహకారంతో తాళం పగులగొట్టించింది. తన అక్క మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ అమర్నాథ్రెడ్డి పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.