Amaravati, March 6: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది, రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసులు కూడా క్రమేణా పెరుగుతున్నాయి. అయితే రోజూవారీ కొత్త కేసులు సాధారణ స్థాయిలోనే ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం.
రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పబ్లిక్ హెల్త్ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో మూడో విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అర్హులైన వారు టీకా చేయించుకునేందుకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే టీకా వేసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు యధావిధిగా పాటించాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది.
ఇక ఏపిలో కరోనా కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,566 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 115 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,90,556 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,87,661గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే కొత్తగా 32 కోవిడ్19 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 20, విశాఖలో 18 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7173కు పెరిగింది.
నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 93 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,82,462 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 921 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.