Amaravati, October 28: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒకటి, రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8.14 లక్షలు దాటినా , ఆక్టివ్ కేసులు 26 వేలలోనే ఉన్నాయి. ప్రతిరోజు కొవిడ్ బారినుండి కోలుకునే వారి సంఖ్య ఏపి నుంచి అధికంగా ఉండటం శుభపరిణామం.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 77,028 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 2,949 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,14,774కు చేరింది, వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,11,879గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 492, తూర్పు గోదావరి జిల్లా నుంచి 417 కేసులు నమోదు కాగా, కృష్ణా నుంచి 457 మరియు గుంటూరు జిల్లా నుంచి 421 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 18 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6625కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,609 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,81,509 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 26,622 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.