AP Municipal Elections Result: మున్సిపల్ పోరులో వైఎస్సార్సీపీదే జోరు, టీడీపీ చేతిలోంచి జారిన కుప్పం, సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్...

నెల్లూరు కార్పొరేషన్ ఫలితాల విషయానికి వస్తే మొత్తం కార్పొరేషన్ లో 54 స్థానాలు ఉంటే.. అందులో 8 ఏక గ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా వైసీపీదే విజయం అయ్యింది. మొత్తం కార్పొరేషన్ ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై సీఎం జగన్ సైతం స్పందిస్తూ ట్వీట్ చేశారు..

CM YS Jagan reviews on Clean AP program (Photo-Twitter/AP CMO)

AP Municipal Elections Result: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రతిహత విజయాలు నమోదు చేసింది. తాజాగా నెల్లూరు కార్పొరేషన్‌ కు.. కుప్పం సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు ప్రకటించారు. కేవలం రెండు మున్సిపాలిటీలు మినహా అన్నింటి వైసీపీ వన్ సైడ్ విక్టరీ సాధించింది. ముఖ్యంగా ఎంతో ఉత్కంఠ రేపిన కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో వైసీపీ గెలుపు సాధించడం టీడీపీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. చంద్రబాబుకు కంచుకోటగా గుర్తింపు పొందిన కుప్పం ఫలితం ద్వారా తమకు తిరుగులేదని వైసీపీ నిరూపించింది.25 వార్డులకు గాను వైసీపీ 19 వార్డుల్లో విజయం సాధించింది.

నెల్లూరు కార్పొరేషన్ ఫలితాల విషయానికి వస్తే మొత్తం కార్పొరేషన్ లో 54 స్థానాలు ఉంటే.. అందులో 8 ఏక గ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా వైసీపీదే విజయం అయ్యింది. మొత్తం కార్పొరేషన్ ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై సీఎం జగన్ సైతం స్పందిస్తూ ట్వీట్ చేశారు..

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి అన్నారు సీఎం జగన్. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వచ్చాయి అన్నారు. వైసీపిని ఇంతలా ఆదరిస్తున్న అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే తాజా ఎన్నికలతో టీడీపీ పతనం అవుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇక పూర్తిగా విశాంత్రి తీసుకోవచ్చన్నారు. ప్రజల తీర్పును వినయంగా, విధేయంగా స్వీకరిస్తున్నామని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలు ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ తీర్పును ఇచ్చారని అన్నారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా తమ నాయకుడు సీఎం జగన్‌ పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎవరైతే 2019లో తమకు ఓట్లు వేయలేదో వాళ్లు కూడా తమ పరిపాలన చూసి ఇప్పుడు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు అవంతి. ఇక మంత్రి అనిల్ సైతం నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Perni Nani Slams Kollu Ravindra: వీడియో ఇదిగో, బొంగులో నువ్వు చేయిస్తా అంటున్న అరెస్టు వల్ల నా ఒక్క రోమం కూడా ఊడదు, కొల్లు రవీంద్రపై విరుచుకుపడిన పేర్ని నాని

Share Now