BRS Secunderabad LS Candidate: సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా MLA పద్మారావు గౌడ్ ప్రకటించిన కేసీఆర్..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించనుంది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయన పేరును శనివారం ప్రకటించారు.

mla padma rao

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించనుంది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయన పేరును శనివారం ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన పార్టీ శాసనసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత పద్మారావు పేరును ఖరారు చేశారు.  పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

Congress Vs BJP: రాహుల్ గాంధీ తాత ముస్లిం..అమ్మ క్రిస్టియన్..మోడీ బీసీ కాదన్న కామెంట్స్‌పై బీజేపీ, రాహుల్ గాంధీది బలహీన వర్గాల కులం అని కాంగ్రెస్ నేతల క్లారిటీ

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు

Vijay Meets Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ను కలిసిన విజయ్, తమిళనాట రచ్చగా మారిన ఇద్దరి కలయిక, దుమ్మెత్తి పోస్తున్న ప్రాంతీయ పార్టీలు

Share Now