Hyderabad, July 6: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 25,733 కి చేరుకుంది.
ఎప్పట్లాగే హైదరాబాద్ నగరం నుంచే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 1419 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం.
హైదరాబాద్ సమీపాన ఉండే మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలలో రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈరోజు రంగారెడ్డి నుంచి 160 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 117 కేసులు వచ్చాయి. అటు ఖమ్మ జిల్లా నుంచి కూడా ఈరోజు 21 కేసులు నమోదు కాగా, మెదక్ మరియు మంచిర్యాల జిల్లాల నుంచి 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్కు కరోనా అంటూ ఫేక్ వార్త, లోకల్ జర్నలిస్టుపై కేసు నమోదు
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 11 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 306 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో పెద్ద మొత్తంలో మరో 2078 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 14,781 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,646 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది
గత 24 గంటల్లో 6,383 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,22,218 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.