Telangana: కుటుంబ కలహాలు, చిన్నారికి ఉరివేసి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Hyd, Jan 16: హబ్సిగూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హబ్సిగూడ అపార్ట్‌మెంట్‌లో (Hyderabad’s Habsiguda) ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Four of a family found dead) పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో దంపతులు, నాలుగేళ్ల బాలిక సహా మరో మహిళ కూడా ఉన్నారు. మృతులు ప్రతాప్‌(34), సింధూర(32), ఆద్య(4), ప్రతాప్‌ తల్లిగా గుర్తించారు.

పండగ సంబరాల వేళ తీవ్ర విషాదం, ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో నలుగురు యువకులు మృతి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తొలుత నాలుగేళ్ల చిన్నారి ఆద్యకు ఉరివేసి ఆపై కుటుంబం అంతా ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని కార్‌ షోరూమ్‌లో ప్రతాప్‌ డిజైనర్‌ మేనేజర్‌గా పని చేస్తుండగా, హిమయత్‌నగర్‌లో ప్రైవేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా సింధూర పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.