Telangana Shocker: ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న వదినా మరదళ్లు, సీన్ కట్ చేస్తే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరుసకు వదినా మరదళ్లు ప్రేమికులుగా మారి పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంతలోనే వీరిలో ఒక అమ్మాయి అనుమానస్పదంగా మరణించగా.. మరో అమ్మాయి తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyd, Mar 16: మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరుసకు వదినా మరదళ్లు ప్రేమికులుగా మారి పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంతలోనే వీరిలో ఒక అమ్మాయి అనుమానస్పదంగా మరణించగా.. మరో అమ్మాయి తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. అంజలి, మహేశ్వరి ఇద్దరూ వరుసకు వదినా మరదళ్లు. వీరిలో మహేశ్వరికి చిన్నతనం నుంచి అబ్బాయిల లక్షణాలు ఉండేవి. ఈ క్రమంలోనే వరుసకు మరదలు అయిన అంజలిని మహేశ్వరి ఇష్టపడింది. అంజలి కూడా మహేశ్వరి ప్రేమించింది. ఇద్దరి మనసులు కలవడంతో పెండ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఒక రూం అద్దెకు తీసుకుని కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.అయితే వీరిద్దరూ బుధవారం రాత్రి రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిద్దరినీ మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అంజలి మృతిచెందింది. మహేశ్వరి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.
ఇటీవల మహేశ్వరితో అంజలి సరిగ్గా ఉండకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)