Hyderabad, August 16: తెలంగాణలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గినట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 12,120 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,102 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1046 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,44,555 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 91,361కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 234 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 63, రంగారెడ్డి జిల్లా నుంచి 81, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 66 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ఒక్క కరీంనగర్ నుంచే నిన్న 101 పాజిటివ్ కేసులు నివేదించబడగా, వరంగల్ అర్బన్ నుంచి 70 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:
ఆగష్టు 15న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 693 కు పెరిగింది.
అలాగే, శనివారం సాయంత్రం వరకు మరో 1930 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 68,126 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.