COVID19 in TS: తెలంగాణలో మరో 1481 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2.34 లక్షలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 18 వేలకు దిగువలో ఉన్న ఆక్టివ్ కేసులు
Coronavirus in India (Photo Credits: IANS)

Hyderabad, October 28:  తెలంగాణలో కొవిడ్19 వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది, అయితే ఇది పండగల సీజన్ కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ మళ్ళీ విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 40,081 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1481 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 664 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,55,597 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,34,152కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 279 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 138, రంగారెడ్డి నుంచి 111,  ఖమ్మం నుంచి 82, కొత్తగూడెం నుంచి 79 మరియు కరీంనగర్ నుంచి 79 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1319కు పెరిగింది.

అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1451 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,14,917 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,916 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.