COVID19 in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,214 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 93 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1135కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyderabad, October 1:  కరోనావైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. ప్రతీరోజు కనీసం 2 వేల కేసుల చొప్పున నమోదవుతున్నాయి. అయితే అదే స్థాయిలో రికవరీలు కూడా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండటం లేదు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 54,443 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,214 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1393 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30,50,444 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,93,600కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 191,  మేడ్చల్ నుంచి 153 కేసులు నిర్ధారణయ్యాయి.

పలు జిల్లాల్లో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది, నిన్న నల్గొండ  జిల్లా నుంచి అత్యధికంగా 149 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  వరంగల్ అర్బన్ నుంచి మళ్లీ పాజిటివ్ కేసులు వంద దాటాయి, ఇక్కడ్నించి 131 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే కరీంనగర్ నుంచి 106 కేసులు నమోదు కాగా, ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాల నుంచి చెరి 99 కేసులు నమోదు చేశాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1135కు పెరిగింది.

అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 2474 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,63,407 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,058 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.