COVID in TS: తెలంగాణలో 20 లక్షలు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు, రాష్ట్రంలో 1,52,602కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 940కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus in India (Photo Credits: IANS)

Hyderabad, September 11:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 62,890 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,426  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 2,242 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,16,401 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,52,602కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 338 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 216,  మేడ్చల్ నుంచి 172 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ విజృంభన కొనసాగుతోంది,  పలు జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిన్న నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే  కరీంనగర్ నుంచి 129, వరంగల్ అర్బన్ నుంచి 108,  ఖమ్మం నుంచి 98, సంగారెడ్డి నుంచి 97 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 11 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 940 కు పెరిగింది.

అలాగే,  గురువారం సాయంత్రం వరకు మరో 2,324 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,19,467 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,195 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.