TS Secretariat Vehicles Auction: తెలంగాణ సచివాలయం వాహనాలు వేలం, ఆగస్టు 20,21 తేదీల్లో వేలం కార్యక్రమం, లాట్లవారీగా బిడ్డింగ్‌, info@ bankauctions.inలో వాహనాల వివరాలు

తెలంగాణ సచివాలయంలో వినియోగంలోలేని వాహనాలను వేలంవేయాలని (TS Secretariat Vehicles Auction) కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగానికి పనికిరాని ఈ వాహనాలను సచివాలయ భవనాల కూల్చివేత సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ వాహనాలు వినియోగంలో లేకపోవడంతో వాటిని వేలం వేయాలని నిర్ణయించింది. వీటిని ఈ నెల 20,21 తేదీల్లో ఈ- వేలం ద్వారా విక్రయించనున్నది. ఈ మేరకు సచివాలయంలోని సాధారణ పరిపాలనశాఖ సమన్వయం చేయనున్నది. వాణిజ్య పన్నులశాఖ, అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, ఆర్టీఏ విభాగాలు సంయుక్తంగా టెండర్‌ పిలిచాయి.

Telangana CM K. Chandrashekhar Rao. | File Photo.

Hyderabad, August 13: తెలంగాణ సచివాలయంలో వినియోగంలోలేని వాహనాలను వేలంవేయాలని (TS Secretariat Vehicles Auction) కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగానికి పనికిరాని ఈ వాహనాలను సచివాలయ భవనాల కూల్చివేత సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ వాహనాలు వినియోగంలో లేకపోవడంతో వాటిని వేలం వేయాలని నిర్ణయించింది. వీటిని ఈ నెల 20,21 తేదీల్లో ఈ- వేలం ద్వారా విక్రయించనున్నది. ఈ మేరకు సచివాలయంలోని సాధారణ పరిపాలనశాఖ సమన్వయం చేయనున్నది. వాణిజ్య పన్నులశాఖ, అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, ఆర్టీఏ విభాగాలు సంయుక్తంగా టెండర్‌ పిలిచాయి.

18న సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో బిడ్లను స్వీకరిస్తారు. ఈ నెల12 నుంచి 16 వరకు ఉదయం11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వాహనాలను పరిశీలించే అవకాశం కల్పించారు. స్క్రాబ్‌ వెహికల్స్‌ 684 ఉండగా.. తిరిగి వినియోగించేందుకు వీలున్నవి 22 ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా ధరావత్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్క్రాప్‌ వాహనాలు 29 లాట్లల్లో ఉన్నాయి. లాట్లవారీగా బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. వాటిల్లో ఉన్న వాహనాల సంఖ్య ఆధారంగా వేలంలో పాల్గొనేవారు ధరావత్‌ చెల్లించాల్సి ఉంటుంది. వేలం ద్వారా విక్రయించే వాహనాల వివరాలన్నీ info@ bankauctions.inలో పొందుపరిచారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పెట్టుబడి సాయంపై మంత్రి కీలక ప్రకటన, అప్పుడే రైతులకు రూ. 20వేలు ఇస్తామని ప్రకటన

Share Now