COVID19 in TS: జిల్లాల్లో విస్తరిస్తోన్న కరోనా, తెలంగాణలో కొత్తగా మరో 2154 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,04,748కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1189కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Cases in India (Photo Credits: PTI)

Hyderabad, October 7: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది, ప్రతిరోజు కనీసం 2 వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మరోవైపు అదే స్థాయిలో రికవరీలు ఉండటం గమనార్హం.  రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 54,277 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  2154 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1525 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,46,472 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,04,748కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 303 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి మరియు మేడ్చల్ పరిధుల్లో కూడా కేసులు మళ్లీ పెరిగాయి.  రంగారెడ్డి నుంచి 205,  మేడ్చల్ నుంచి 187 కేసులు నిర్ధారణయ్యాయి.

జిల్లాల నుంచి నమోదయ్యే కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది.  నిన్న నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే  ఖమ్మం 121, కరీంనగర్ నుంచి 96 మరియు కొత్తగూడెం నుంచి 92 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:
Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1189కు పెరిగింది.

అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 2239 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,77,008 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,551 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.