Russia Fires Missiles and Drones in Ukraine (Photo Credit: X/@ZelenskyyUa)

Kyiv, Sep 4: ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై మిసైళ్లతో విరుచుకుప‌డింది. ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ సీఎన్ఎన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు.  మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు

పోల్టావాలో ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యన్ ద‌ళాలు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు తనకు సమాచారం అందిందని అన్నారు. ఇక ఈ దాడి కార‌ణంగా టెలికమ్యూనికేషన్స్ ఇనిస్టిట్యూట్ భవనాలలో ఒకటి పాక్షికంగా ధ్వంసం అయిన‌ట్లు ప్రెసిడెంట్ పేర్కొన్నారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులు ఆ ప్రాంతాన్ని తాకాయి" అని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే మృతుల‌కు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.ఈ సంద‌ర్భంగా రష్యా దాడి త‌ర్వాత త‌మ‌కు సహాయం చేస్తున్న వారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.