ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ దక్కడం లేదు. ఇవాళ్టితో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
...