దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండవ దశలో తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లాక్డౌన్ అంశాలపై (India Lockdown Row) కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి లాక్డౌన్ విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా చర్యల్ని చేపడతామని ఆమె వెల్లడించారు.
...