బ్యాంకులను మోసగించి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల (Mehul Choksi, Nirav Modi, Vijay Mallya) నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)ప్రకటించింది. రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్లో వివరించింది.
...