బేతుల్ జిల్లా మాండవీలో (Mandvi) నానక్ చౌహాన్ అనే రైతు రెండేళ్ల క్రితం తన పొలంలో బోర్ వేశారు. అందులో నీళ్లు అడుగంటిపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. బోరుబావిని (borewell) కప్పి ఉంచానని, అందులో ఎలా పడిపోయాడో తెలియడం లేదని పోలీసులకు చెప్పాడు. నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో తన్మయ్ సాహు (Tanmay Sahu) అనే 8ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయినట్లు భావిస్తున్నారు.
...