యూపీలోని గౌతం బుద్ధ నగర్ జిల్లాలో జేవార్లో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి (Noida International Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్తో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 1,330 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. దీన్ని 2024 నాటికి పూర్తి చేయనున్నారు.
...