చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘షియోమీ ఇండియా` అధికారులకు, మూడు బ్యాంకుల అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రూ.5551 కోట్ల నిధుల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై షియోమీ ఇండియా సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్, మూడు విదేశీ బ్యాంకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఈడీ అధికారులు శుక్రవారం ట్వీట్లో ధ్రువీకరించారు.
...