కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఎన్నికయ్యారు. మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటెల్ లో జరిగిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభాపక్ష సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మాయినే తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్లను కేంద్ర పరిశీలకులుగా హజరయ్యారు.
...