ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రులు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గమ్మను వివిధ రూపాల్లో పూజిస్తూ, ఉపవాసం పాటించడం ద్వారా శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత కలుగుతాయని నమ్మకం. అయితే ఉపవాస సమయంలో కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
...