పెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీడీనగర్లో 65 సంవత్సరాల వృద్ధురాలు శివరాత్రి పోచమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ కేసు వివరాలను పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. హత్య కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
...