రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందేనని ( Fine on mask in Hyderabad) ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా ( fine of Rs 1,000 for who not wearing masks) విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
...