ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం మోటోరొలా (Motorola) తన కొత్త 5జీ స్మార్ట్ఫోన్ జీ64ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన జీ62 స్మార్ట్ఫోన్కు కొనసాగింపుగా జీ64 5జీని (Moto G64) భారత్ లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 14, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది.
...