Rajasthan Shocker: అంకుల్ ఇంట్లో లేడా ఆంటీ అంటూ, ఇంట్లోకి ప్రవేశించి, వివాహితపై అత్యాచారం జరిపిన యువకుడు, వీడియో తీసి బ్లాక్ మెయిల్..
యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన కలకలం రేపుతోంది.
మానవ సంబంధాలు రోజురోజుకు ఊ తరిగిపోతున్నాయి కామంతో కళ్లు మూసుకుపోయి కొందరు వావివరుసలు మర్చిపోతున్నారు క్షణిక సుఖం కోసం నేరాలకు పాల్పడుతున్నారు తాజాగా యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు.
దూరపు బంధువైన ఓ యువకుడు వారి ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. బంధువే కదా అని అతనిపై ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే, ఒకరోజు ఆ ఇంటి యజమాని పని పైన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇది గమనించిన ఆ యువకుడు వారి ఇంటికి వెళ్ళాడు.
నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించాడు అనంతరం మహిళను తన కోరిక తీర్చాలంటే పట్టుబడ్డాడు అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు అంతటితో ఆగకుండా విషయం ఎవరికైనా చెబితే నీ భర్తను చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె భయపడి విషయం ఎవరికీ చెప్పలేదు. అంతేకాదు ఆమె వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇక అతడి బెదిరింపులు భరించలేక ఆమె విసిగివేసారి పోయింది చివరకు గత్యంతరం లేక అసలు విషయం తన భర్తకు చెప్పేసింది
అనంతరం భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 25, 2022 04:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

