Pink Ball Test Day-Night: ఈడెన్ గార్డెన్స్లో విరబూసిన గులాబీ, భారత క్రికెట్లో చారిత్రాత్మక ఘట్టం, తొలిసారి డే-నైట్ టెస్టుకు వేదికైన కోల్కతా, ప్రేక్షకులతో పూర్తిగా నిండిపోయిన స్టేడియం
ఈ మ్యాచ్ పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. "ఈడెన్ గార్డెన్స్ లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు భారత క్రికెట్ లో ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ ఆడటం....
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) ఎన్నో చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్లకు వేదికైంది, రోహిత్ శర్మ వన్డేలలో 264 అత్యధిక పరుగుల రికార్డ్ మ్యాచ్, ఆస్ట్రేలియాపై తొలిసారిగా ఫాలో ఆన్ ఆడుతూ ఇండియా గెలిచిన మ్యాచ్, 2016 టీ20 ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ ఇలా ఎన్నో ఉన్నాయి. భారత్ ఇక్కడ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే మళ్లీ ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ (India vs Bangladesh) అలాంటి ఓ ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేదికైంది. శుక్రవారం ఇక్కడ ఇండియా - బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్లు చూడటం కొత్తేమి కాదు, కాకపోతే ఈ మ్యాచ్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇండియాలో తొలిసారిగా డే-నైట్ టెస్ట్ మ్యాచ్ (Day- Night Test) జరుగుతుంది. ఇప్పటికే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
స్థానిక కాలమానంప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం. మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్లో తొలిసారిగా 'గులాబీ' రంగు బంతిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి గులాబీ హంగులు అద్దారు. ఈ మ్యాచ్ కు పేరుకూడా 'పింక్ బాల్ టెస్ట్' (Pink Ball Test) గా ప్రచారం చేస్తున్నారు. స్టేడియం గులాబీ లైట్లతో, బెలూన్లతో అలంకరించారు. ఆకాశంలో ఒక పింక్ బ్లింప్ ఉంచారు - మైళ్ళ దూరం నుండి ఇది కనిపిస్తుంది, స్టేడియం చుట్టూ గోడలను అలంకరించే అందమైన క్రికెట్ కుడ్యచిత్రాలు ఉన్నాయి మరియు జగ్మోహన్ దాల్మియా మరియు సౌరవ్ గంగూలీ స్టాండ్లలోని లైట్లు దానికి పింక్ రంగును కలిగి ఉన్నాయి. ఇక స్టేడియం అలంకారణాల గురించి వర్ణించతరం కాదు.
ఇక ఈ మ్యాచ్కు మొత్తం టికెట్స్ అమ్ముడుపోయాయి. స్టేడియం నిండుగా తొలిసారిగా ఒక టెస్ట్ మ్యాచ్ చూసే అనుభూతి స్టేడియంలోని ప్రేక్షకులకు, టీవీ వీక్షకులకు కలుగుతుంది. మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంయుక్తంగా ఈ మ్యాచ్ ప్రారంభించనున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్ ధోనీ, అనిల్ కుంబ్లే లాంటి వెటరన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వస్తున్నారు. మాజీ టెస్ట్ కెప్టెన్లందరికీ ఆహ్వానం పంపారు. వారిచే క్రికెట్ కామెంటరీ కూడా ఉండబోతుంది.
మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) స్పందిస్తూ, ఈ మ్యాచ్ పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. "ఈడెన్ గార్డెన్స్ లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు భారత క్రికెట్ లో ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ ఆడటం పట్ల సంతోషంగా ఉంది". అని కోహ్లీ అన్నాడు.
పిచ్ మీద పచ్చిక ఉంది. బంతి స్పిన్ మరియు స్వింగ్ వేగంగా జరగవచ్చు. గులాబీ బంతి వేగంగా ప్రయాణిస్తుంది, కాబట్టి ఆడేటపుడు ఊహించిన దానికంటే వేగంగా దూసుకురావొచ్చు. అలాగే క్యాచ్ లు పట్టేటపుడు కూడా కొంత కష్టంగా అనిపించవచ్చు. డే-నైట్ కాబట్టి మంచు, ఫ్లడ్ లైట్ల కింద ఆడటం కూడా సవాలుతో కూడుకున్న పని అని కోహ్లీ అభిప్రాయపడ్డారు.
ఇతర D / N టెస్ట్ల మాదిరిగా కాకుండా, కోల్కతా ఆట సాంప్రదాయానికి భిన్నంగా విరామ సమయాల క్రమాన్ని కలిగి ఉంటుంది. లంచ్ బ్రేక్ మధ్యాహ్నం 3 నుంచి 3:40 వరకు, టీ బ్రేక్ సాయంత్రం 5:40 నుంచి 6:00 వరకు ఉంటుందని మ్యాచ్ అధికారులు తెలిపారు. రోజూ మధ్యాహ్నం 1 నుంచి ఒక రోజులో అటూ ఇటుగా 90 ఓవర్ల మ్యాచ్ షెడ్యూల్ చేయబడింది.
(The above story first appeared on LatestLY on Nov 22, 2019 01:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

