Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఏపీ తీరప్రాంతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ కథనం ప్రకారం శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రేపటి వాతావరణం: విశాఖపట్నం వాతావరణ సూచన.. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను, గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
APSDMA Issues Rain Alert for Several Districts in Andhra Pradesh Today
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం (06-08-2026) శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA వెల్లడించింది.#lightning #safetyfirst pic.twitter.com/UGdQSSJYGD
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 5, 2026
ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఆశ్రయం పొందాలని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పిడుగుపాటు ప్రమాదాల బారిన పడకుండా చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇనుప విద్యుత్ టవర్లు మరియు హోర్డింగ్ల కింద నిలబడవద్దని ఏపీఎస్డీఎంఏ విజ్ఞప్తి చేసింది.