(Photo-Twitter)

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక  కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లి రాజస్థాన్‌లో జరిగిందని, పిల్లలు లేరని దరఖాస్తులో ఉంది. చైతన్య జొన్నలగడ్డ - నిహారికల విడాకులకు కారణాలు ఏంటో తెలియదు గానీ వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.