Centre Warns Latecomers: ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు.. త్వరగా ఇంటికి వెళ్ళినా కూడా.. సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు.. ఒక్క రోజు ఆఫీసుకు ఆలస్యమైనా ఒక సీఎల్ తొలగించాలని సూచన
ప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయ్యింది.
Newdelhi, June 17: ప్రభుత్వ కార్యాలయాలు (Central Government Offices) అంటే లేటుగా (Late) పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్రం (Central Government) సీరియస్ అయ్యింది. ఇలాంటి వారితో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్ తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆఫీసుకు ఆలస్యమవుతున్నారని గుర్తించినట్టు తెలిపింది. ఈ మేరకు ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఆదేశాలు ఇలా..
- ఆలస్యంగా వచ్చిన ఒక్కరోజుకు ఒక పూట సాధారణ సెలవు చొప్పున కోతపెట్టాలి.
- ఒకవేళ సీఎల్ లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలి.
- తగిన కారణాలు ఉన్నట్టైతే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చు.
- ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని ఆలస్యంగా రావడంతో సమానంగానే చూడాలి. దానికి పై నిబంధనలే పాటించాలి.
(The above story first appeared on LatestLY on Jun 17, 2024 09:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

