Cadila Pharmaceuticals CMD Rajiv Modi Arrest: బల్గేరియా యువతి అత్యాచారం కేసులో క్యాడిలా ఫార్మా కంపెనీ చైర్మన్ రాజీవ్ మోదీ అరెస్టు
బల్గేరియన్ మహిళ ఫిర్యాదుపై కాడిలా ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజీవ్ మోదీపై అత్యాచారం, దాడి , ఉద్దేశపూర్వక అవమానం కేసు నమోదైంది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
బల్గేరియన్ మహిళ ఫిర్యాదుపై కాడిలా ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజీవ్ మోదీపై అత్యాచారం, దాడి , ఉద్దేశపూర్వక అవమానం కేసు నమోదైంది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును గతంలో దిగువ కోర్టు కొట్టివేసింది. వివారాల్లోకి వెళితే అహ్మదాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ సిఎండిపై ఆదివారం ఐపిసి సెక్షన్లు 376 (అత్యాచారం), 354 ( నేరపూరిత బలవంతం) , 504 కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ HM కన్సాగ్రా తెలిపారు.
గుజరాత్ హైకోర్టు నుంచి అందిన సూచనల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ఏసీపీ కన్సాగ్రా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాడిలా ఫార్మా సీఎండీ రాజీవ్ మోదీ, జాన్సన్ మాథ్యూ అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని డిసెంబర్ 22న హైకోర్టు ఆదేశించింది.
ఆఫీసు బాత్రూమ్లో అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణ
బల్గేరియాకు చెందిన ఈ బాలిక రాజీవ్ మోదీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆఫీసు బాత్రూమ్లో కూడా రాజీవ్ తనపై అత్యాచారం చేసేవాడని ఆమె చెప్పింది. తనకు కేడిలాలో ప్రైవేట్ ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెకు నమ్మబలికినట్లు బాధితురాలు పేర్కొంది. ఒకసారి రాజీవ్ మోదీ తనను చాలాసేపు ఆఫీసులో బంధించి అత్యాచారం చేశాడని తెలిపింది.
ఆఫీసు బాత్రూంలో కూడా తనపై అత్యాచారం చేసేవాడని బాధితురాలు పేర్కొంది. ఫిర్యాదు చేయడంతో నన్ను కంపెనీ నుంచి తొలగించారు. తన వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీ కూడా బ్లాక్ చేశారని బాధిత మహిళ పేర్కొంది. కరోనా లేనప్పటికీ, దేశం విడిచి వెళ్లమని తనపై ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు వాపోయింది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
పోలీసుల నుంచి కూడా సహాయం అందలేదని, తనవద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. అహ్మదాబాద్ పోలీసులకు ఇ-మెయిల్ చేయడం ప్రారంభించినప్పుడు, తనను వస్త్రపూర్ మహిళా పోలీస్ స్టేషన్కు పంపారని, తనను ప్రశ్నలు అడుగుతూ వేధించారని బాధితురాలు ఆరోపించింది. ఇంతలో జాన్సన్ మాథ్యూ లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి కంపెనీ అధికారుల మధ్య విషయం ఉందని అఫిడవిట్పై బలవంతంగా సంతకం చేయించారు. నిందితులకు పోలీసులు సహకరించారని బాధితురాలు ఆరోపించింది.
(The above story first appeared on LatestLY on Jan 01, 2024 09:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

