Kiran Bhai Patel: పీఎంవో ఉద్యోగినంటూ కశ్మీర్ బార్డర్లో పర్యటనలు, జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిన బలగాలు, లాల్చౌక్ సహా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఫోటోలు దిగిన మోసగాడు
ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకుంటూ మోసాలు చేసేవారు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కానీ ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకొని ఏకంగా బార్డర్ లో జెడ్ ప్లస్ సెక్యూరిటీతో తిరిగాడు. పైగా అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు కూడా చేశాడు. సినిమాను కూడా తలదన్నే రేంజులో జరిగిన ఈ మోసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Srinagar, March 17: ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకుంటూ మోసాలు చేసేవారు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కానీ ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకొని ఏకంగా బార్డర్ లో జెడ్ ప్లస్ సెక్యూరిటీతో తిరిగాడు. పైగా అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు కూడా చేశాడు. సినిమాను కూడా తలదన్నే రేంజులో జరిగిన ఈ మోసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిరణ్ భాయ్ పటేల్ (Kiran Bhai Patel) అనే వ్యక్తి తనను ను ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారినంటూ ఏకంగా జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడీ కొట్టించాడు. వైవ్ స్టార్ అకామిడేషన్, బుల్లెట్ ఫ్రూవ్ కాన్వాయ్, జడ్ ప్లస్ సెక్యూరిటీ (Z plus Security).. ఇలా సకల సౌకర్యాలతో సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో కూడా పర్యటించాడు. కానీ, ఎంత చేస్తే మాత్రం ఏం లాభం.. కాస్త ఆలస్యంగానైనా నిజం బయటపడాల్సిందే. చివరకు విషయం పోలీసులకు తెలిసిపోయి కటకటాల వెనక్కు వెళ్లిపోయాడు.
गुजरात के एक महाठग ने PMO के नाम पर सरकारी तंत्र का दुरुपयोग किया, जनता के करोड़ों रुपए फूंक कर Z+ Security के साथ Bulletproof गाड़ी में छुट्टियां मनाई..
Just to clarify, शख़्स का नाम Kiran Bhai Patel है। https://t.co/fOhlPGxqpO
— AAP (@AamAadmiParty) March 17, 2023
కిరణ్ భాయ్ పటేల్. స్వస్థలం గుజరాత్. కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ (J&K officials) అధికారులకు తాను పీఎంవోలో అడిషనల్ డైరెక్టర్ (PMO) అని పరిచడం చేసుకున్నాడు. ఇక అంతే.. అక్కడి యంత్రాంగం నుంచి సకల సౌకర్యాలు పొందుతున్నాడు. గత అక్టోబర్ నుంచి ఇది కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఎడాపెడా తిరుగుతూ జడ్ ప్లస్ కేటగిరీ మధ్య రక్షణ పొందుతున్నాడు. వీవీఐపీలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని సౌకర్యాలు వాడుతున్నాడు. జమ్మూ కశ్మీర్ యంత్రాంగాన్ని కిరణ్ ఎంతలా నమ్మించాడంటే.. అతడికి ప్రత్యేకంగా వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నాడంటే అధికారులు ఎంతలా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. దేశ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలను కూడా అధికారిక హోదాలో సందర్శించాడు. నియంత్రణ రేఖ సమీపంలోని ఉరి నుంచి శ్రీనగర్ లోని లాల్ చౌక్ (Lal Chowk) వరకు వెళ్లాడు. అతడి మాటలకు మోసపోయిన అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. ఇక అన్ని ప్రాంతాలు తిరుగుతూ నెట్టింట్లో తన పర్యటన విశేషాలు షేర్ చేస్తూ వచ్చాడు.
BJP का ठग #KiranBhaiPatel pic.twitter.com/tfF3VxODcA
— AAP (@AamAadmiParty) March 17, 2023
అతడికి పారామిలిటరీ భద్రత కల్పించిన చిత్రాలు, మంచులో నడిచిన చిత్రాలు, సున్నిత ప్రాంతాల్లో పర్యటన చిత్రాలు నెట్టింట్లో షేర్ చేశాడు. అతడి సరదా పర్యటనే అతడిని మోసం చేసింది. రెండు వారాల్లో రెండోసారి పర్యటనకు రావడంతో నిఘా వర్గాలకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులను అప్రమత్తం చేయడం, వారు గత చరిత్రను తోడటం చకచకా జరిగిపోయాయి. అంతే.. కిరణ్ భాయ్ బంఢారం మొత్తం బయటపడింది. అతడు వసతి ఉంటున్న హోటల్ గదిలోనే పది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. దీని మీద గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. వాస్తవానికి కిరణ్ భాయ్ కి వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా ఉంది. కానీ బయోలో ఎక్కడా పీఎంవో గురించిన ప్రస్తావన లేదు. ‘థింకర్, స్ట్రాటజిస్ట్, అనలిస్ట్, క్యాంపెయిన్ మేనేజర్’ అనేవి మాత్రం ఉన్నాయి. ఇక కిరణ్ ను ట్విట్టర్ లో గుజరాత్ బీజేపీ నేతలు కొందరు ఫాలో అవుతుండడం విశేషం.
(The above story first appeared on LatestLY on Mar 17, 2023 07:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

