Delhi Shocker: ఢిల్లీలో దారుణం, యువతిని రైల్వే స్టేషన్ వెనుక పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు, ఇద్దరిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద 17 ఏళ్ల యువతిని గ్యాంగ్ రేప్ ( Minor girl raped ) చేశారు. తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
New Delhi, August 9: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద 17 ఏళ్ల యువతిని గ్యాంగ్ రేప్ ( Minor girl raped ) చేశారు. తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని హర్దీప్ నగర్ , రాహుల్గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో వాటర్ బాటిళ్లు అమ్ముతుంటారు.ఐపీసీ 376డీ కింద కేసును బుక్ చేశారు.ఆ ఇదర్నీ అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసు ఆఫీసర్ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్కు చెందిన ఓ అమ్మాయి తన ఫ్రెండ్ దీపక్తో కలిసి ఢిల్లీ స్టేషన్కి (New Delhi railway station) వచ్చింది. గుజరాత్ వెళ్లేందుకు రైలు ఎక్కాల్సి సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. సెంట్రల్ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న సమయంలో అమ్మాయికి, దీపక్కు ఘర్షణ జరిగింది.గొడవ తరువాత దీపక్ ఆమెను స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు కామాందులు ఆమెను కలిశారు.
సోదరుడికి ఫోన్ కాల్ చేసేందుకు మొబైల్ ఇవ్వాలని ఆ అమ్మాయి వారిని వేడుకున్నది. రైలు దొరికేలా హెల్ప్ చేయాలని ఆ అమ్మాయి వాళ్లను అడిగింది. అయితే మరో స్టేషన్ వద్ద ట్రైన్ దొరకుతుందని చెప్పిన ఇద్దరూ ఆ అమ్మాయిని తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి రేప్ చేశారు.అనంతరం పరార్ అయ్యారు. బాధితురాలు ఎలాగోలా పొదల్లో నుంచి బయటకు వచ్చి స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
(The above story first appeared on LatestLY on Aug 09, 2022 03:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

