Chhattisgarh High Court: ఛత్తీస్ ఘడ్ హై కోర్టు సంచలన తీర్పు, వివాహ బంధంలో శృంగారాన్ని నిరాకరించడం క్రూరమైనది, భార్య సెక్స్ ఒప్పుకోవడం లేదని అప్పీల్ చేసిన భర్తకు విడాకులు మంజూరు...

ఆరోగ్యకరమైన దాంపత్యానికి శారీరక సంబంధం తప్పనిసరి అని జస్టిస్ పి సామ్ కోశి, పార్థ ప్రతీమ్ సాహులతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. "ఈ కేసులో భార్య క్రూరత్వం చేసిందని మేము నమ్ముతున్నాము. ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం తప్పనిసరి.

Chhattisgarh High Court: ఛత్తీస్ ఘడ్ హై కోర్టు సంచలన తీర్పు, వివాహ బంధంలో శృంగారాన్ని నిరాకరించడం క్రూరమైనది, భార్య సెక్స్ ఒప్పుకోవడం లేదని అప్పీల్ చేసిన భర్తకు విడాకులు మంజూరు...
Court Judgment, representational image | File Photo

బిలాస్ పూర్, మార్చి 5: ఛత్తీస్ ఘడ్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. శృంగారాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమేనని పేర్కొంది. వెంటనే ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. భార్యాభర్తల విడాకుల కేసులో ఛత్తీస్‌ఘడ్ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. తన భార్య తనతో కలిసేందుకు ఇష్టపడటం లేదని, శృంగారానికి అంగీకరించడం లేదంటూ ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు భార్యతో విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు.

దీనిపై విచారించిన ఛత్తీస్‌ఘడ్ కోర్టు వెంటనే ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శృంగారాన్ని నిరాకరించం కూడా క్రూరత్వమేనని అభిప్రాయడింది. భార్యా భర్తల మధ్య సంబంధం ఆరోగ్యకరంగా ఉండాలని, శృంగారం కూడా వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని కోర్టు అభిప్రాయపడింది.

ఆరోగ్యకరమైన దాంపత్యానికి శారీరక సంబంధం తప్పనిసరి అని జస్టిస్ పి సామ్ కోశి, పార్థ ప్రతీమ్ సాహులతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. "ఈ కేసులో భార్య క్రూరత్వం చేసిందని మేము నమ్ముతున్నాము. ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం తప్పనిసరి. గత 10 సంవత్సరాలుగా దంపతుల మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. అందువల్ల మేము అప్పీలుదారుని అభ్యర్థనపై అభిప్రాయపడ్డాము. ప్రతివాది భార్య క్రూరంగా ప్రవర్తించింది" అని ధర్మాసనం పేర్కొంది.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

బిలాస్‌పూర్ వ్యక్తి నవంబర్ 25, 2007న బెమెతర జిల్లాకు చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత, ఆ వ్యక్తి భార్య 2008లో తీజ్ పండుగ కోసం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆమె రక్షాబంధన్ తర్వాత తన భర్త వద్దకు తిరిగి వచ్చింది.

జూలై 2011లో పిటిషనర్ తండ్రి చనిపోయాడు. ఈ సమయంలో, మహిళ తన భర్తతో కొంతకాలం ఉండి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.

2010 తర్వాత, అన్ని ముఖ్యమైన పండుగలు మరియు పుట్టినరోజుల కోసం మహిళ తన భర్త వద్దకు నాలుగు సంవత్సరాలు తిరిగి రాలేదు. ఆమె జూలై 26, 2014న తన భర్త ఇంటికి తిరిగి వచ్చి, మళ్లీ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.

పిటిషనర్ తన భార్యను మొబైల్ ఫోన్‌లో సంప్రదించి, తిరిగి రావాలని కోరినప్పుడు, ఆమె తన భర్తను బెమెతరలోని తన పుట్టింటికి వచ్చి స్థిరపడాలని కోరింది.

భార్య ప్రవర్తనతో కలత చెందిన వ్యక్తి హిందూ వివాహ చట్టం 1955 కింద విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశాడు. కానీ అతని అభ్యర్థనను డిసెంబర్ 13, 2017న కుటుంబ న్యాయస్థానం తిరస్కరించింది.

ఆ వ్యక్తి తనకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు తీర్పును ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సవాలు చేశాడు.

(The above story first appeared on LatestLY on Mar 05, 2022 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).