High Alert At Guntur Vizag Railway Station: సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో నేడు వైజాగ్ రైల్వేస్టేషన్ మూసివేత, గుంటూరు, విజయవాడ స్టేషన్లలో హై అలర్ట్...

కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను మూసివేసి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

High Alert At Guntur Vizag Railway Station: సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో నేడు వైజాగ్ రైల్వేస్టేషన్ మూసివేత, గుంటూరు, విజయవాడ స్టేషన్లలో హై అలర్ట్...
Representative Image (Photo Credits: Unsplash)

Vizag: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను మూసివేసి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ ఆశావహులు భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలను అనుసరించి, అధికారులు స్టేషన్‌ను మూసివేసి, రైళ్లను ఉదయం 7 గంటలకు నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఉదయం 7 గంటల వరకు స్టేషన్‌లోకి అనుమతించారు. తర్వాత, స్టేషన్‌ను అందరికీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ నుంచి వచ్చే అన్ని రైళ్లను శివార్లలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఆపడం లేదా దారి మళ్లించడం జరిగింది. హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద ఆపడం లేదా దారి మళ్లించడం జరిగింది.

మరోవైపు గుంటూరు రైల్వే స్టేషన్‌లో సైన్యంలో చేరాలని భావిస్తున్న యువత భారీ నిరసనకు దిగుతున్నట్లు సమాచారం అందడంతో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి, టిక్కెట్లను తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులను ప్రాంగణంలోకి అనుమతించారు. గుంటూరు స్టేషన్‌ వైపు వెళ్తున్న 20 మంది యువకులను కొత్తపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు స్టేషన్‌లో నిరసన తెలిపేందుకు వాట్సాప్‌లో మెసేజ్‌లు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు.

Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు 

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. వందలాది మంది యువకులు విధ్వంసానికి దిగి రైళ్లకు, వస్తువులకు నిప్పుపెట్టి, స్టేషన్‌ను ధ్వంసం చేయడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తొమ్మిది గంటలకు పైగా నిరసన కొనసాగిన అనంతరం పోలీసులు యువకులను అరెస్టు చేశారు. శుక్రవారం అర్థరాత్రి రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.

(The above story first appeared on LatestLY on Jun 18, 2022 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).