Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం

హర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.

Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం
Another fight brewing in Haryana poll: As AAP, NOTA and the Communists battle it out, NOTA seems to be winning (Photo-wiki)

Chandigarh,October 24: హర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం చేజిక్కించుకుంటుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీని నోటా ఇంటికి సాగనంపింది. అలాగే ఇతర పార్టీలైన సీపీఎం, సీపీఐలు కూడా డిపాజిట్లను కోల్పోయాయి. ఈ పార్టీలన్నింటికంటే నోటాకే అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి. హర్యానా ఓటర్లు ఈ మూడు పార్టీలను కాదనుకుని నోటాకు ఎక్కువ ఓట్లు వేశారు. ఈ నోటా ఓట్లు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఓ రకంగా అధికారానికి దూరం చేశాయనే చెప్పవచ్చు.

ఈసీఐ వెబ్‌సైట్ డేటా ప్రకారం నోటా ( None Of The Above) ఆప్ కన్నా ఎక్కువ ఓట్లను గెలుచుకుంది. నోటాకు ఈ ఎన్నికల్లో 0.55% ఓట్లు రాగా ఆమ్ ఆద్మీ పార్టీకి 0.45% ఓట్లు వచ్చాయి. రెండు కమ్యూనిస్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు వరుసగా 0.03%, 0.09% ఓట్లు మాత్రమే వచ్చాయి.

కాగా హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీపార్టీ తాము ఆ రాష్ట్రంలో బలంగా ఉన్నామని చెప్పింది. అయితే ఈరోజు వెలువడుతున్న ఫలితాలు ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 0.45 శాతం ఓట్లు మాత్రమే దక్కడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. దీనికిముందు హర్యానాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించి, అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఒక్క లోక్‌సభ సీటును కూడా దక్కించుకోలేకపోయింది.

(The above story first appeared on LatestLY on Oct 24, 2019 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).