Kerala Lottery: అదృష్టం అంటే ఇదేగా.. 11 మంది మహిళలు కలిసి రూ.250 పోగేసి లాటరీ టిక్కెట్ కొనుగోలు.. దానికే తగిలిన రూ.10 కోట్లు.. తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని మహిళల హర్షం.. కేరళలో ఘటన
కష్టాల్లో ఉన్నవారిని అదృష్టం రూపంలో ఆ దేవుడే గట్టుకు చేరుస్తాడన్న విషయం మరోసారి రుజువైంది. కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించిన ఘటన ఇది.
Newdelhi, July 28: కష్టాల్లో ఉన్నవారిని అదృష్టం రూపంలో ఆ దేవుడే (God) గట్టుకు చేరుస్తాడన్న విషయం మరోసారి రుజువైంది. కేరళకు (Kerala) చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం (Luck) అనూహ్యంగా వరించిన ఘటన ఇది. రాత్రికి రాత్రి వారందరూ లక్షాధికారులైపోయిన ఆనందభారిత క్షణమిది. రూ.250ల లాటరీ టిక్కెట్టును (Lottery Ticket) 11 మంది మహిళలు డబ్బులు పోగేసి మరీ కొనుక్కుని చివరకు రూ.10 కోట్లు గెలుచుకున్నారు. అసలు విషయం ఏంటంటే? కేరళలోని పరప్పనన్ గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన కొందరు పేద మహిళలు స్థానికంగా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్ కు తరలిస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం.
11 Women Pooled Money To Buy Rs 250 Lottery Ticket. They Won Rs 10 Crore https://t.co/aykhCQMoTi pic.twitter.com/fL0Mp7py7E
— NDTV News feed (@ndtvfeed) July 27, 2023
కనీసం పాతిక రూపాయలు కూడా..
లాటరీ టికెట్ తో తమ అదృష్టం మారుతుందని ఆశపడే వాళ్లు. అయితే, టిక్కెట్టు కొనుగోలుకు వారి వద్ద కనీసం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 28, 2023 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

