Delhi Shocker: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి 6 నిండుప్రాణాలు బలి, సీసీటీవీలో వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం..
ఘజియాబాద్ సమీపంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై మంగళవారం కారు, పాఠశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు.
ఘజియాబాద్ సమీపంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై మంగళవారం కారు, పాఠశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు. సమాచారం ప్రకారం, క్రాసింగ్స్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో NH-9లో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్కూల్ బస్సు ఖాళీగా ఉందని, రాంగ్ డైరెక్షన్ నుంచి వస్తున్నట్లు సీసీటీవీలో గుర్తించారు "ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఈరోజు ఉదయం 6.00 గంటలకు స్కూల్ బస్సు, కారు ప్రమాదానికి గురయ్యాయి. ఘాజీపూర్ సమీపంలో ఢిల్లీ నుండి CNG నింపి బస్సు డ్రైవర్ రాంగ్ డైరక్షన్ లో వస్తున్నాడు. కారులో ఉన్న వ్యక్తులు మీరట్ నుండి వస్తున్నారు. అప్పుడే బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనగా. 6 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ను పట్టుకున్నారు. రాంగ్ సైడ్ నుంచి వస్తున్న బస్సు డ్రైవర్దే పూర్తి తప్పు", రామానంద్ కుష్వాహా ADCP ట్రాఫిక్ పోలీసులు ఏఎన్ఐకి తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని ఏడీసీపీ తెలిపారు.
WATCH - School Bus-SUV Crash On Delhi-Meerut Expressway Near Ghaziabad, 6 Dead.#BusAccident #Ghaziabad #DelhiMeerutExpressway pic.twitter.com/djl7m4CZRp
— TIMES NOW (@TimesNow) July 11, 2023
"చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళలు మరియు పురుషులు కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారులో 8 మంది ఉన్నారు. బస్సు నోయిడాలోని బాల్ భారతి స్కూల్ బస్సుకు చెందినది", ADCP కుష్వాహా అన్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
(The above story first appeared on LatestLY on Jul 13, 2023 03:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

