IND Win by 280 Runs: బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్‌ భారీ విజయం, ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

IND Win by 280 Runs: బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్‌ భారీ విజయం, ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌
Ravichandran Ashwin (Photo Credits: BCCI)

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో సెంచరీ చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి (6/88)తో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లా పనిపట్టాడు.

బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు

రవీంద్ర జడేజా (3/58) రాణించడంతో 515 పరుగుల ఛేదనలో పర్యాటక జట్టు 234 పరుగులకే ఆలౌట్‌ అయి భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌లో రెండో టెస్టు ఈనెల 27 నుంచి కాన్పూర్‌ వేదికగా జరుగనుంది.

(The above story first appeared on LatestLY on Sep 23, 2024 10:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).