Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడుకు దూసుకొస్తున్న కల్లక్కడల్ ముప్పు, ఈ రోజు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం

కేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు) ముప్పు పొంచి ఉందని అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడుకు దూసుకొస్తున్న కల్లక్కడల్ ముప్పు, ఈ రోజు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం
Cyclone Fengal to hit Tamil Nadu: Rainfall disrupts flight, schools shut and Andhra Pradesh May witness Heavy Rains

Chennai, Jan 15: కేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు) ముప్పు పొంచి ఉందని అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో మీటరు వరకు ఈ అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీవోఐఎస్) హెచ్చరికలు జారీచేసింది. వెంటనే తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, చిన్నచిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు రాత్రి లోగా తీరానికి చేర్చుకోవాలని సూచించింది. మళ్లీ ప్రకటన చేసే వరకు వరకు పర్యాటకులు ఎవరూ బీచ్‌ల వద్దకు రావొద్దని పేర్కొంది.సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది.

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) తీరం వెంబడి నివసించే ప్రజలు ప్రమాదకర ప్రాంతాలలో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎక్కడికి వెళ్లాలనే దానిపై స్థానిక అధికారులు వారికి మార్గనిర్దేశం చేస్తారు.తీరప్రాంత నివాసితులు చిన్న పడవలు లేదా దేశీ పడవల్లో సముద్రంలోకి వెళ్లవద్దని, హార్బర్‌లో తమ ఫిషింగ్ బోట్‌లను సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. హెచ్చరిక ఎత్తివేసే వరకు బీచ్‌లలో ఎటువంటి పర్యాటక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.సముద్ర మట్టాలు అకస్మాత్తుగా పెరగడం వల్ల తీరప్రాంత కోతకు గురయ్యే ప్రమాదం ఉన్నందున అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని KSDMA జోడించబడింది.

(The above story first appeared on LatestLY on Jan 15, 2025 03:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).