Minister Dada Bhuse: ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. తినకపోతే కొంపలేమీ మునిగిపోవు.. మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. అని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.
Newdelhi, Aug 23: దేశంలో ఉల్లిగడ్డ (Onions) ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ (Minister Dada Bhuse) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. అని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలిపారు. ఉల్లిగడ్డను తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవన్నారు. ప్రధానంగా వంటల్లో ఉల్లిగడ్డను వాడినా వాడక పోయినా పెద్ద తేడా ఏమీ లేదని తెలిపారు.
Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోంది: జూపల్లి
Onions | ఉల్లిగడ్డలు కొనలేకుంటే.. తినడం మానేయండి.. మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలుhttps://t.co/QVIIv9kdva
— Namasthe Telangana (@ntdailyonline) August 23, 2023
ఇంతనీ ఆయన ఏమన్నారంటే?
‘మీరు 10 లక్షల విలువైన వాహనాన్ని ఉపయోగించేటప్పుడు, రిటైల్ ధర కన్నా 10 నుంచి 20 రూపాయలకు ఎక్కువకు సరుకును కొనవచ్చు. అదేమీ మీకు పెద్ద భారం కాదు. అలా కాకుండా పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టమేమీ ఉండదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
(The above story first appeared on LatestLY on Aug 23, 2023 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

