Photo Shoot Turns Tragedy: రైల్వే బ్రిడ్జిపై దంపతుల పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన జంట.. రాజస్థాన్ లో ఘటన.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి.

రాజస్థాన్ లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

Photo Shoot Turns Tragedy: రైల్వే బ్రిడ్జిపై దంపతుల పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన జంట.. రాజస్థాన్ లో ఘటన.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి.
Train (Credits: Wikimedia commons)

Jaipur, July 15:  ప్రమాదకరమైన ప్రాంతాల్లో సేల్ఫీలు, ఫోటో షూట్ లు ఇటీవలి కాలంలో  ఎక్కువయ్యాయి. ముందూ, వెనుక ఆలోచించకుండా చేసే ఇలాంటి విచిత్ర విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణాలమీదకు తీసుకొస్తాయి. ఇదీ అలాంటి ఘటనే.  రాజస్థాన్ (Rajasthan) లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై (Train Bridge) ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు. దంపతులు బ్రిడ్జి మధ్యలో ఉండగా అటువైపుగా ఓ రైలు వచ్చింది.

జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు

ఆందోళనకు గురైన నూతన జంట

రైలు దూసుకురావడంతో ఆందోళనకు గురైన నూతన జంట బ్రిడ్జి మీద నుండి 90 అడుగుల లోతు లోయలోకి దూకేశారు. ఈ ఘటనలో రాహుల్‌ కు వెన్నుముకకు తీవ్ర గాయమవ్వగా, జాన్వికి కాలు విరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

(The above story first appeared on LatestLY on Jul 15, 2024 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).