Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్‌ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్‌ జైలులోనే ఉన్నారు.

Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..
Former MP Nandigam Suresh's Sent 14 Days Remand in Dalit Woman Murder Case ( Photo-X)

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్‌ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్‌ జైలులోనే ఉన్నారు. మరోవైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వైజాగ్‌లో హానీ ట్రాప్ కేసు వెలుగులోకి, యువకులని రూంకి పిలిచి న్యూడ్‌లో ఉండగా ముఠా ఎంటర్, ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్

న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్‌ విధించింది. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ మరణించింది. అప్పట్లో ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేశ్‌ పేరును కూడా ఈ కేసులో చేర్చారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 07, 2024 04:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).