Coronavirus in India: మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, 24 గంటల్లో 12వేలు దాటిన కొత్తకేసులు, క్రమంగా పెరుగుతున్న పాజిటివిటీ రేటు, ఆందోళనలో కేంద్రం, రాష్ట్రాలు అప్రమత్తం
దేశంలో కరోనా కేసులు (Corona Cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్ (Corona positive) వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు (Recoveries) కోలుకున్నారు.
New Delhi, AUG 18: దేశంలో కరోనా కేసులు (Corona Cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్ (Corona positive) వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు (Recoveries) కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్గా (Active cases) ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
#COVID-19 | India reports 12,608 fresh cases, and 16,251 recoveries in the last 24 hours.
Active cases 1,01,343
Daily positivity rate 3.48% pic.twitter.com/024JthekAp
— ANI (@ANI) August 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 2022 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

